వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహన స్ఫూర్తినిపెంపొందిచుకుందాం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌లో మతపరమైన హింస చెలరేగడంపై రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో శాంతి సామరస్యాలనుపెంపొందించడానికి సప్రదాయబద్దమైన సంయమన స్ఫూర్తిని తిరిగి పాదుకొల్పడం అవసరమని ఆయన అన్నారు. గుజరాత్‌ మత ఘర్షణల దృష్ట్యా ఈ ఏడాది హోలీ జరుపుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.

శతాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన బహు మతాల సామరస్యానికి ఈ రంగుల పండుగ ఒక ప్రతీక అని తన హోలీ సందేశంలో అన్నారు. సహన స్ఫూర్తి దేశ సంస్కృతి, నాగరికతల సారమని ఆయన అన్నారు.

హోలీని సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించుకుని ఆ పండుగ విశిష్టతను కాపాడుదామని ఉప రాష్ట్రపతి క్రిషన్‌కాంత్‌ అన్నారు. మత, కుల, స్థాయీ భేదాలను దాటి ప్రజల పరస్పర సహకారాన్నిపెంపొందించుకునే సందేశాన్ని హోలీ ఇస్తుందని ఆయన తన సందేశంలో అన్నారు. భావోద్వేగాలవినిమయాన్ని, సామాజిక అనుబంధాన్ని ఈ పండుగ పెంచుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X