సహన స్ఫూర్తినిపెంపొందిచుకుందాం

న్యూఢిల్లీ: గుజరాత్‌లో మతపరమైన హింస చెలరేగడంపై రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో శాంతి సామరస్యాలనుపెంపొందించడానికి సప్రదాయబద్దమైన సంయమన స్ఫూర్తిని తిరిగి పాదుకొల్పడం అవసరమని ఆయన అన్నారు. గుజరాత్‌ మత ఘర్షణల దృష్ట్యా ఈ ఏడాది హోలీ జరుపుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.

శతాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన బహు మతాల సామరస్యానికి ఈ రంగుల పండుగ ఒక ప్రతీక అని తన హోలీ సందేశంలో అన్నారు. సహన స్ఫూర్తి దేశ సంస్కృతి, నాగరికతల సారమని ఆయన అన్నారు.

హోలీని సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించుకుని ఆ పండుగ విశిష్టతను కాపాడుదామని ఉప రాష్ట్రపతి క్రిషన్‌కాంత్‌ అన్నారు. మత, కుల, స్థాయీ భేదాలను దాటి ప్రజల పరస్పర సహకారాన్నిపెంపొందించుకునే సందేశాన్ని హోలీ ఇస్తుందని ఆయన తన సందేశంలో అన్నారు. భావోద్వేగాలవినిమయాన్ని, సామాజిక అనుబంధాన్ని ఈ పండుగ పెంచుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+