వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్‌ ప్రమాదంలో 13 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఏడు బ్యాంక్‌లకు నాలుగు కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపిపెట్టిన వ్యక్తిని హైదరాబాద్‌ తూర్పు మండలం పోలీసులు గురువారంఅరెస్టు చేశారు. కైలాస్‌ అమర్నాథ్‌ అనే ఈ వ్యక్తి ఆరు జాతీయ బ్యాంక్‌ల నుంచి ఒక ప్రయివేట్‌ బ్యాంక్‌ నుంచి నకిలీ డాక్యుమెంట్లతో కోటి 42 లక్షల రూపాయలఅప్పు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

అతను తీసుకున్నఅప్పు వడ్డీతో కలిసి నాలుగు కోట్ల రూపాయలు అవుతుందని వారు చెప్పారు. ఎస్‌బిహెచ్‌, ఎస్‌బిఐల నుంచే కాకుండా చార్మినార్‌ కో ఆపరేటివ్‌అర్బన్‌ బ్యాంక్‌ నుంచి 1986 నుంచి అతను ఈ అప్పులు తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈఅప్పులు మంజూరు చేయించుకోవడానికి అతను కొందరు బ్యాంక్‌ అధికారులకు ముడుపులు కూడా చెల్లించినట్లు వారు చెప్పారు.

బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులతో కైలాస్‌ అమర్నాథ్‌ రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ సమీపంలో 33 ఎకరాల భూమిని కొనుక్కున్నాడని, ఈ భూమిని, ఇతర ఆస్తులనుస్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటామని తూర్పు మండల పోలీసు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంపై నగర పోలీసు కమిషనర్‌కు ఒక నివేదిక పంపిస్తామని వారన్నారు. ఈ వ్యవహారంలో బ్యాంక్‌ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయనున్నట్లు వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X