దుబాయ్ ప్రమాదంలో 13 మంది మృతి
హైదరాబాద్: ఏడు బ్యాంక్లకు నాలుగు కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపిపెట్టిన వ్యక్తిని హైదరాబాద్ తూర్పు మండలం పోలీసులు గురువారంఅరెస్టు చేశారు. కైలాస్ అమర్నాథ్ అనే ఈ వ్యక్తి ఆరు జాతీయ బ్యాంక్ల నుంచి ఒక ప్రయివేట్ బ్యాంక్ నుంచి నకిలీ డాక్యుమెంట్లతో కోటి 42 లక్షల రూపాయలఅప్పు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
బ్యాంక్ల నుంచి తీసుకున్న అప్పులతో కైలాస్ అమర్నాథ్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో 33 ఎకరాల భూమిని కొనుక్కున్నాడని, ఈ భూమిని, ఇతర ఆస్తులనుస్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటామని తూర్పు మండల పోలీసు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంపై నగర పోలీసు కమిషనర్కు ఒక నివేదిక పంపిస్తామని వారన్నారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయనున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications