వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత జాబితాపై మాట మార్చిన అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ 20 మంది తీవ్రవాదులను తమకుఅప్పగించాలని భారత్‌ చేస్తున్న డిమాండ్‌ విషయంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది. తీవ్రవాదుల అప్పగింత, తదితర సమస్యలను భారత్‌, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా అభిప్రాయపడింది.

తీవ్రవాదుల అప్పగింతవిషయంలో కలిసి నిర్ణయం తీసుకోవడానికి ఇరు పక్షాలను తాము ప్రోత్సహించామని, తమ విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ పర్యటన సందర్భంగా ఇరు దేశాలను తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించామని,అందులో ఈ అంశం కూడా ఉన్నదని అమెరికా విదేశీ వ్యవహారాల డిప్యూటీ అధికార ప్రతినిధి పిలిప్‌ రీకర్‌విలేకరుల సమావేశంలో అన్నారు. జర్నలిస్టు పెరల్‌ కిడ్నాప్‌, హత్య కేసుల్లో నిందితుడైనషేక్‌ ఒమర్‌ సయీద్‌ను తమకు అప్పగించాలని కోరడానికి, 20 మంది తీవ్రవాదులను భారత్‌ తనకుఅప్పగించాలని డిమాండ్‌ చేయడానికి మధ్య సంబంధం లేదని రీకర్‌ అన్నారు. ఈ రెండు ఒకటి కావని రీకర్‌ అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X