వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌డిఎలో విభేదాలు లేవు: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌విషయంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పూర్తి ఐక్యంగా వుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఎన్‌డిఎలో భిన్నాభిప్రాయాలున్నట్లు ప్రతిపక్షం చిత్రీకరిస్తోందని ఆయన శనివారం ధ్వజమెత్తారు. గుజరాత్‌ వ్యవహారంపై ఏ నిబంధన కింద పార్లమెంటులో చర్చ జరగాలనేవిషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదని ఆయన చెప్పారు.

గుజరాత్‌ సంఘటనలపై పార్లమెంటులో చర్చ జరగాలనేవిషయంపై భిన్నాభిప్రాయాలు లేవని, తమ అభిప్రాయాలను చెప్పే హక్కు సభ్యులకు ఉన్నదని, ఏ నిబంధన కింద చర్చ జరగాలనేవిషయంపై భిన్నాభిప్రాయాలున్నాయని, ఈ విభేదాలు చిల్లర స్థాయికి చేరాయని ఆయన జాతీయాభివృద్ధిలోస్వచ్ఛంద పాత్రపై జరిగిన సమావేశంలో అన్నారు.

పాలక కూటమిలో విభేదాలు లేవని, ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించడం అవసరమని ఆయన అన్నారు. గుజరాత్‌ సంఘటనలను తీవ్ర స్థాయిలో ఇది వరకే ఖండించానని వాజ్‌పేయి గుర్తు చేశారు.
గుజరాత్‌ సంఘటనలపై తాను చేసిన ప్రకటన కూడా చర్చకు దారి తీసిందని ఆయన చెప్పారు. మన రాజ్యాంగ నిర్మాతలు లౌకిక చట్రానికి పునాదులు వేశారని, మత ప్రాతిపదిక దేశానికి పునాదులు వేయలేదని ఆయన చెప్పారు.

చీకటిలో చిరు దీపాలు కూడా మార్గాలు చూపుతాయని, గుజరాత్‌ సంఘటనలు మన కృషిని ప్రశ్నార్థకం చేశాయని ఆయన అన్నారు. గుజరాత్‌ బాధితులకు సహాయం చేసేందుకుస్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X