విద్యుత్‌లో ఆంధ్రనే ఆదర్శం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏకపక్ష అప్రజాస్వామిక వైఖరిని విడనాడి, ప్రజాస్వామిక వాదుల, ప్రజల సూచనల మేరకు కాల్పులవిరమణ ప్రకటించాలని పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం కాల్పులవిరమణ ప్రకటించిన వెంటనే తమ వైపు నుంచి కాల్పులవిరమణ అమలులోకి వస్తుందని పీపుల్స్‌వార్‌ హామీ ఇచ్చింది.

ఈ మేరకుపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ పేర శుక్రవారం ఒక ప్రకటన విడుదలయింది. గతంలో తాము ప్రకటించిన విధంగానే ప్రజల మనోభావాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలను వ్యక్త పరుస్తూ తమ డిమాండ్ల పత్రాని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా ప్రభుత్వంతో చర్చలు ఎక్కడ జరగాలనేవిషయమై వెంటనే తెలియజేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో చర్చలకు అనువైన శాంతియుత వాతావరణం ఏర్పడడానికి ఉభయ పక్షాల నుంచి కాల్పులవిరమణ ప్రకటించాలని కోరామని, అయితే దానిపై హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌ స్పందిస్తూ కాల్పులవిరమణ డిమాండ్‌ ముందస్తు షరతు అవుతున్నందున దాన్ని త్రోసిపుచ్చుతున్నట్లు ప్రకటించారని రామకృష్ణ అన్నారు. చర్చలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదని దేవేందర్‌ గౌడ్‌ ప్రకటనను బట్టిఅర్థమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వైపు చర్చల ప్రక్రియకువిఘాతాలు కలిగిస్తూ మరో వైపు తాము చర్చలకు సిద్ధంగా వున్నామని ప్రభుత్వం ప్రకటించడం నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లుగా వుందని ఆయన వ్యాఖ్యానించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+