వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక పెరుగుదలకు విధానం: యశ్వంత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: భారత ఆర్థికపెరుగుదల రేటు స్థిరంగా ఏడు నుంచి 8 శాతం వుండేలా ఒక విధానాన్ని అవలంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా చెప్పారు. ఏడు, ఎనిమిది శాతం కన్నా తక్కువపెరుగుదల రేటును పతనావస్థగా పరిగణించనున్నట్లు ఆయన తెలిపారు.

కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, అమెరికా- భారత వాణిజ్య మండలి సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక దశలో భారత ఆర్థికపెరుగుదల రేటు 3.3 శాతానికి పడిపోయిందని ఆయన చెప్పారు. పరిస్థితి మెరుగుపడిపెరుగుదల రేటు 2001 చివరి మూడు నెలల్లో 6.3 శాతానికి చేరుకుందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంఎయిర్‌లైన్స్‌ను ప్రయివేటీకరించాలనుకుందని, అయితే మంచిఆఫర్స్‌ రాలేదని ఆయన చెప్పారు. అమెరికాలో సెప్టెంబర్‌ 11వ తేదీన జరిగిన దాడుల వల్ల పరిస్థితివిషమించిందని ఆయన అన్నారు.

ఎయిర్‌లైన్స్‌ను ప్రయివేటీకరించాలనే అనుకుంటున్నామని, ఈలోగా ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియా ఫ్లీట్‌ను పటిష్టపరుస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, చెన్నైవిమానాశ్రయాలను కూడా ప్రైవేటీకరించనున్నట్లు ఆయన తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాల నుంచి భారత్‌ వెనక్కి మళ్లబోదని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X