ఉగ్రవాద ఆర్థిక లావాదేవీలపై పోరు
వాషింగ్టన్: ఉగ్రవాదుల డబ్బుల నెట్వర్క్పై పోరాటం ఉధృతం చేయాలని ప్రపంచ ఆర్థిక అధినేతలు నిర్ణయించుకున్నారు. 183 మంది సభ్యుల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉగ్రవాదుల నిధుల లావాదేవీలపై, అక్రమ కార్యకలాపాలపై అంతర్జాతీయంగా పోరాటం చేయాలని ఆ దేశాలు నిర్ణయించుకున్నాయి. ప్రపంచ స్థాయిలో నిరంతర నిఘా, సకాల చర్యలపైవిజయం ఆధారపడి వుంటుందని అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక కమిటీ సభ్యులన్నారు.












Click it and Unblock the Notifications
