వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని హింస: మృతుల సంఖ్య 24

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్లో సోమవారం కూడా అల్లర్లు కొనసాగాయి. విధ్వంస కాండ, అల్లర్లు, కత్తిపోటు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం నుంచి జరుగుతున్న హింసాకాండలో అహ్మదాబాద్‌లో మరణించినవారి సంఖ్య 24కుపెరిగింది. ప్రేమ్‌ దర్వాజ ప్రాంతంలోని మాధవపురాలో సోమవారం సాయంత్రం ఒక వ్యక్తిని అల్లరి మూకలు రాళ్లతో కొట్టి చంపాయి.షాపూర్‌, జమాల్పూర్‌లలో ఇద్దరు కత్తిపోట్లకుగురై మరణించారు.

షాపూర్‌లో అల్లరి మూకలు గుడిసెలకు, దుకాణాలకు నిప్పంటించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.షాపూర్‌, దరియాపూర్‌, కలూపూర్‌, మాధవపూరా, పాంకోర్‌ నాకా, ప్రేమ్‌ దర్వాజ ప్రాంతాలకు అల్లర్లుపాకాయి. పలు చోట్ల ఆదివారం నుంచి విధ్వంసకాండ కొనసాగుతూనే వున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X