వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంస్థాగత మార్పులు చేసిన సోనియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎఐసిసిలో అధ్యక్షురాలు సోనియా గాంధీ సంస్థాగత మార్పులు చేపట్టారు.అంబికా సోనీ, అహ్మద్‌ పటేల్‌ సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శులుగా నియమితులయ్యారు.

రాజ్యసభ సభ్యులైన సోనీ, పటేల్‌ సోనియా గాంధీకి సన్నిహితులు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించేఅంబికా సోనీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలి కార్యాలయం ఇన్‌ఛార్జీగా వుంటారు. జమ్మూ కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, కేరళ, రాజస్థాన్‌ రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను కూడా ఆమె చూస్తారు. పార్టీ మీడియాసెల్‌ బాధ్యతలు కూడా అంబికా సోనీయే నిర్వహిస్తారు.

నిరుడు ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మహవీర్‌ ప్రసాద్‌పై వేటు పడింది. మహారాష్ట్రకు చెందిన యువ కాంగ్రెస్‌ నాయకుడు ముకుల్‌ వాస్నిక్‌, రాజ్యసభ మాజీ పార్లమెంటు సభ్యుడు వాయలార్‌ రవి ఎఐసిసి ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. వాస్నిక్‌ యూత్‌ కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ వంటి అనుబంధ సంస్థల కార్యకాలాపాలను పర్యవేక్షిస్తారు. వాయలార్‌ రవి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను చూస్తారు.

రవితో పాటు శివరాజ్‌ పాటిల్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యులుగా నియమితులయ్యారు.సీనియర్లు జె.బి. పట్నాయక్‌, ఎస్‌.బి. చవాన్‌ సిడబ్ల్యుసికిశాశ్వత ఆహ్వానితులు. సాల్మన్‌ కుర్షీద్‌, ఒమెన్‌ దొయిరి ప్రత్యేక ఆహ్వానితులు. అధికార ప్రతినిధి ఎస్‌. జైపాల్‌ రెడ్డిఎక్స్‌- అఫిషియో ఆహ్వానితుడు. కృష్ణ త్రిపాఠీ,పర్వేజ్‌ హష్మీ, ఇక్బాల్‌ సింగ్‌ కొత్త ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X