వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై థాకరే ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభస్పీకర్‌ పదవిపై నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అల్టిమేటమ్‌ ఇచ్చింది. లోక్‌సభస్పీకర్‌ పదవిని తీసుకుంటారో, లేదో రెండు వారాల్లోగా తమకు చెప్పాలని తెలుగుదేశం పార్టీకి చెప్పినట్లు బిజెపి అధికార ప్రతినిధివిజయ్‌కుమార్‌ మల్హోత్రా సోమవారం విలేకరులకు చెప్పారు.

మే 10వ తేదీ లోగా ఈవిషయంపై తెలుగుదేశం తన నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సన్నిహితులొకరు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫోన్‌ చేసి చెప్పినట్లు ఆయన తెలిపారు. లోక్‌సభస్పీకర్‌ పదవిని ఎన్‌సిపి నేత పి.ఎ. సంగ్మాకు ఇవ్వడానికి బిజెపి సుముఖంగా వున్నదనే వార్తలను పార్టీ వర్గాలు ఖండిస్తున్నాయి. తెలుగుదేశం ముందుకు రాకపోతే బిజెపియే తన అభ్యర్థిని పెడుతుందని ఆ వర్గాలు చెప్పాయి.

ఇదిలా వుంటే, బిజెపి అల్టిమేటంను పెద్ద పట్టించుకోవడం లేదు. గుజరాత్‌ సమస్య ఇప్పుడు ప్రధానమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు అన్నారు. ఇప్పుడు స్పీకర్‌ పదవి గురించి ఆలోచించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు గుజరాత్‌లో శాంతి సామరస్యాలను నెలకొల్పడం అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X