వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాఓదార్పుతోపులకరించిన అనంతరైతు

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: తమ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను నెరవేర్చగలదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఎస్‌ఆర్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు (కెసిఆర్‌) అన్నారు. టిఆర్‌ఎస్‌ రెండు రోజుల ప్రథమ వార్షికోత్సవాలను ఆయన శుక్రవారంనాడిక్కడ ప్రారంభించారు.

కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ గురించి ఇతర పార్టీలు చెబుతున్నవన్నీ కల్లబొల్లి కబుర్లేనని ఆయన అన్నారు. వామపక్షాలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని ఆయన సూచించారు. తెలంగాణపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేచర్ల ఫోరమ్‌ చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల మూర్ఖత్వానికి తాను సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్‌ నేతలు నాటకం ఆడుతున్నారని,అందుకు తాను బాధ పడుతున్నానని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X