రాత్రంతా బాబు ఎదురుచూపులు
హైదరాబాద్:
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు,
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
మంగళవారం
రాత్రి
పార్టీ
కార్యాలయం
ఎన్టీఆర్
ట్రస్టు
భవనంలో
ఢిల్లీ
పరిణామాల
కోసం
ఎదురు
చూస్తూ
కూర్చున్నారు.
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
సమాధానం
అయిపోగానే
తమ
పార్టీ
లోక్సభ
సభ్యులకు
సూచన
ఇవ్వడానికి
ఆయన
నిరీక్షిస్తూ
వున్నారు.
చంద్రబాబు
వెంటనే
తన
నిర్ణయం
తీసుకోవడానికి
లోక్సభలో
జరుగుతున్న
చర్చను
గమనిస్తూ
కూర్చున్నారు.
మీడియా
దృష్టిఅంతా
తెలుగుదేశం
పార్టీ
నిర్ణయం
మీదనే
వుండడంవిశేషం.
గుజరాత్పై
184వ
నిబంధన
కింద
మంగళవారం
ఉదయం
ప్రారంభమైన
చర్చ
రాత్రి
పొద్దు
పోయేవరకు
సాగింది.
దీంతో
గంటల
తరబడి
ఉత్కంఠ
కొనసాగుతూనే
వున్నది.
తెలుగుదేశం
తన
నిర్ణయాన్ని
ప్రకటించకపోవడం
వల్ల
ఈ
ఉత్కంఠ
మరింతగా
చోటు
చేసుకుంది.
చర్చను
ముగించేందుకు
ఢిల్లీలో
అఖిల
పక్ష
సమావేశం
జరిగింది.
మరింత
కొంత
సమయం
కావాలని
ప్రతిపక్షాలు
అడగడంతో
మరింత
జాప్యం
జరిగింది.