వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్కు 150 కోట్ల పునరావాస పథకం
న్యూఢిల్లీ:
గుజరాత్కు
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
150
కోట్ల
పునరావాస
పథకాన్ని
ప్రకటించారు.
రాజకీయాలకు
అతీతంగా
పార్టీలు
ముందుకు
రావాలని
ఆయన
పిలుపునిచ్చారు.
గుజరాత్
పరిణామాలపై
184వ
నిబంధన
కింద
ప్రతిపక్షాలు
ప్రతిపాదించిన
తీర్మానంపై
లోక్సభలో
సుదీర్ఘ
చర్చ
అనంతరం
బుధవారం
తెల్లవారు
జామున
ఆయన
సమాధానమిచ్చారు.
గుజరాత్ విషయంలో తాను మాట మార్చాననే విమర్శలో నిజం లేదని, తాను గుజరాత్లో ఏమన్నానో అదే గోవాలో అన్నానని ఆయన చెప్పారు. తాను జాతి, మత భేదాలు పాటించలేదని ఆయన స్పష్టం చేశారు.
మీడియాపై ఆయన విమర్శలు చేశారు. మీడియా పాత్రపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. సమాచారం ఇచ్చేపేరుతో ఏది పడితే అది రాయడం మంచిది కాదని ఆయన అన్నారు. మీడియాపై నియంత్రణ వుండాలని తాను అనడం లేదని, మీడియా సంప్రదాయం పాటించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, May 1, 2002, 23:53 [IST]