వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌కు 150 కోట్ల పునరావాస పథకం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌కు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి 150 కోట్ల పునరావాస పథకాన్ని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గుజరాత్‌ పరిణామాలపై 184వ నిబంధన కింద ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానంపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం తెల్లవారు జామున ఆయన సమాధానమిచ్చారు.

రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని ప్రతిపక్ష నేత సోనియా గాంధీ తనను అడిగారని, తాను ఆమెసెంటిమెంట్స్‌ను గౌరవిస్తున్నానని, రాజకీయాలకు అతీతంగా తాను ముందుకు రావాలని అనుకుంటున్నానని, సోనియా గాంధీ కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. ఆయన దాదాపు 25 నిమిషాల పాటు మాట్లాడారు.

గుజరాత్‌ విషయంలో తాను మాట మార్చాననే విమర్శలో నిజం లేదని, తాను గుజరాత్‌లో ఏమన్నానో అదే గోవాలో అన్నానని ఆయన చెప్పారు. తాను జాతి, మత భేదాలు పాటించలేదని ఆయన స్పష్టం చేశారు.

మీడియాపై ఆయన విమర్శలు చేశారు. మీడియా పాత్రపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. సమాచారం ఇచ్చేపేరుతో ఏది పడితే అది రాయడం మంచిది కాదని ఆయన అన్నారు. మీడియాపై నియంత్రణ వుండాలని తాను అనడం లేదని, మీడియా సంప్రదాయం పాటించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X