వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త సిజెగా కిర్‌పాల్‌ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళే వారు దళారుల చేతుల్లో పడి మోసపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ భావిస్తున్నది. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళేవారు బోగస్‌ సంస్థల చేతుల్లో పడి మోసపోతున్నారు. వారిని కాపాడడంతో పాటు మార్గదర్శకంగా వుండేందుకువీలుగా ఓవర్‌ సీస్‌ ఎంప్లాయ్‌ మెంట్‌ గైడింగ్‌ బ్యూరోని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంప్లాయ్‌ మెంట్‌ఎక్స్చేంజ్‌ ల డైరక్టరేట్‌ ప్రతిపాదించింది. ఈ వినూత్న ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు ఎంప్లాయ్‌ మెంట్‌ఎక్స్చేంజ్‌ ల డైరక్టర్‌ వి. వెంకట్రామిరెడ్డి చెప్పారు.

తమ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకొనే వారికి విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంఅందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమిళనాడులో ఇప్పటికే ఈ తరహా సంస్థ విదేశీ ఉద్యోగాలకు వెళ్ళే నిరుద్యోగులకు సహకరిస్తున్నదని ఆయనవివరించారు. విదేశీ ఉద్యోగాలకు వెళ్లే వారు ఈ బ్యూరోలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకొనేలా నిబంధనల్లో మార్పులు చేసే ఆలోచన కూడా వున్నదని ఆయనవివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X