వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మదాబాద్‌ లో 8మంది మృతి, కర్ఫ్యూ

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః కరీంనగర్‌ మార్కెట్‌ యార్డులో మంగళవారం నాడు ఒక రైతు మరణించాడు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల అత్యాశ కారణంగా నాలుగురోజులుగా ఈ రైతు తిండి నీళ్ళు లేక మరణించాడని భావిస్తున్నారు. సాటి రైతు కళ్ళముందే మరణించడంతో మార్కెట్‌ యార్డుకు వచ్చిన రైతులు రణభేరి మోగించారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో మార్కెట్‌ యార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగురోజులుగా సరుకుతో రైతులు మార్కెట్‌ యార్డులో పడిగాపులు పడుతున్నా తమను పట్టించుకొనే నాధుడే లేడని రైతులు వాపోయారు.

నాలుగు రోజుల కిందట పంటతో మార్కెట్‌ యార్డుకు వచ్చిన వృద్ధ రైతు ఆకలికి తట్టుకోలేక, ఎండకు తాళలేక మరణించాడని రైతులు వాపోయారు. జిల్లా కలెక్టర్‌ మార్కెట్‌ యార్డును సందర్శించారు. రాష్ట్రంలో రైతులు దీనస్థితి ఈ సంఘటన అద్దంపడుతున్నదని ప్రతిపక్షాలు అప్పుడే కత్తులు నూరుతున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X