వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ పై అద్వానీతో గిల్‌ చర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గుజరాత్‌ కల్లోలాన్ని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి నరేంద్రమోడి సలహాదారుగా నియమితులైన పంజాబ్‌ మాజీ డిజిపి కెపిఎస్‌ గిల్‌ మంగళవారం కేంద్ర హోం మంత్రి అద్వానీని కలిశారు. అద్వానీతో గిల్‌ సుమారుఅరగంట సేపు సుదీర్ఘంగా చర్చించారు. గుజరాత్‌ సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి గిల్‌ అద్వానీకివివరించారని భావిస్తున్నారు.

పంజాబ్‌ లో తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో సిద్ధహస్తుడిగా పేరుతెచ్చుకున్న గిల్‌ గత మూడు రోజులుగా గుజరాత్‌ లో విస్తృతంగా పర్యటించారు. గుజరాత్‌ పోలీసులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గిల్‌ రాకతో గుజరాత్‌ అల్లర్లు తగ్గుముఖం పడతాయని ఆ రాష్ట్రప్రజలు గంపెడాశతో వున్నారు. మళ్ళీ హింసాగ్ని రాజుకుంటున్న గుజరాత్‌ సమస్య పరిష్కారానికి గిల్‌ ఏ చిట్కా ప్రయోగిస్తారో వేచి చూడాలి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X