మార్కెట్ యార్డులో రైతు కన్నుమూత
కరీంనగర్ః కరీంనగర్ మార్కెట్ యార్డులో మంగళవారం నాడు ఒక రైతు మరణించాడు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల అత్యాశ కారణంగా నాలుగురోజులుగా ఈ రైతు తిండి నీళ్ళు లేక మరణించాడని భావిస్తున్నారు. సాటి రైతు కళ్ళముందే మరణించడంతో మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు రణభేరి మోగించారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగురోజులుగా సరుకుతో రైతులు మార్కెట్ యార్డులో పడిగాపులు పడుతున్నా తమను పట్టించుకొనే నాధుడే లేడని రైతులు వాపోయారు.












Click it and Unblock the Notifications
