వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ దాడిలో పాక్‌ హస్తం: జార్జి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మూ సమీపంలోని కలొచక్‌సైనిక శిబిరంపై టెర్రరిస్టుల దాడిలో పాకిస్థాన్‌ హస్తం ఉన్నదని భారత రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ బుధవారంనాడు ఆరోపించారు.

ఈ సంఘటనలో 39 మంది మరణించినవిషయం తెలిసిందే. పరిస్థితిని అక్కడికక్కడఅంచనా వేయడానికి ఇక్కడికి చేరుకున్న ఫెర్నాండెజ్‌- పాకిస్థాన్‌ నుంచి ఇటువంటిది తప్ప మంచిదేదీ ఎదురవుతుందని అనుకోలేదని అన్నారు. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు. ఇటువంటి దారుణ కృత్యాలు చేయడానికి పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌ యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికాధికారులను, వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X