వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ సమ్మెపై ఉక్కుపాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సమ్మె చేస్తున్న విద్యుత్‌ సమ్మె పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత పదిరోజులుగా సాగుతున్న సమ్మెను కఠినంగా అణిచివేయాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నాడు శాంతియుతంగా సమ్మెలో పాల్గొంటున్న 350 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలకు ప్రయత్నం చేసిన ఉద్యోగులను పోలీసులు చెదరగొట్టారు.

సమ్మెను ఇటు జెఎసి అటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆప్షన్లతో పాటు వివిధ న్యాయమైన డిమాండ్‌లపై ప్రజాస్వామ్య పద్దతుల్లో ఉద్యోగులు సాగిస్తున్న సమ్మెను ప్రభుత్వం కర్కశంగా అణిచివేయాలని చూస్తున్నదని ఉద్యోగులు ఆరోపించారు. ఇదిలా వుండగా గత పదిరోజులుగా సాగుతున్న ఈ సమ్మెపై తొలిసారిగా బుధవారం నాడువిద్యుత్‌ ఉద్యోగుల సంఘాల్లో అభిప్రాయబేధాలు వ్యక్తం అయ్యాయి. సమ్మెకు వ్యతిరేకంగా ఒక యూనియన్‌ చేసిన
ప్రకటనలు ఉద్యోగుల్లో కలవరం సృష్టించాయి. సమ్మె విచ్ఛిత్తికి ప్రభుత్వం సామ, దాన, భేద, దండోపాయలను ప్రయోగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ కొత్త పరిణామం అనేక అనుమానాలకు తావు ఇస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని కేంద్రాల్లోనూవిద్యుత్‌ సమ్మె పట్ల పోలీసులు కరుగ్గా వ్యవహరించినట్టుగా సమాచారంఅందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X