అవసరమైతేపాక్పై ఎదురు దాడి: భారత్
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అవసరమైతే పాకిస్థాన్పై ఎదురుదాడికి దిగడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం లోక్సభ తీర్మానం చేసింది. జమ్మూలో ఈ నెల 14వ తేదీన జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో సీమాంతర ప్రేరేపిత ఉగ్రవాదంపై దాదాపు ఏడు గంటల చర్చ అనంతరం లోక్సభ ఆ తీర్మానం చేసింది. రాజ్యసభ కూడా ఇదేరకమైన తీర్మానం చేసింది.
నిర్దిష్టమైన వ్యూహాన్ని ప్రకటించడానికి లోక్సభసరైన వేదిక కాదని, నిర్ణయాత్మక వ్యూహ రూపకల్పనకు నేటి చర్చ ఎంతో ఉపయోగకరంగా వున్నదని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక పోరులో కీలక భాగస్వామిగా చేర్చుకోవడం ద్వారా వాషింగ్టన్ పాకిస్థాన్కు ప్రోత్సాహాన్నిఅందివ్వడం పట్ల అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీమాంతర ఉగ్రవాదంపై పోరులో మనం గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ఎవరిమీదా ఆధారపడబోమని చెప్పారు. నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
