వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్‌ ఫస్టియర్‌లో బాలికలదేపైచేయి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలదేపైచేయిగా వుంది. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను అధికారులు శుక్రవారంనాడు విడుదల చేశారు.

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవ్సరం పరీక్షల్లో మొత్తం 33.5 శాతం మందివిద్యార్థినీవిద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 37.3 శాతం వుంది. మొత్తం 5 లక్షల 27 వేల మందిపైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా లక్షా 76 వేల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల సాధనలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా ఆదిలాబాద్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 51 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉత్తీర్ణతా శాతం 16.7 శాతం మాత్రమే వుంది.

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకుహాజరు కాగోరే విద్యార్థులు ఈ నెల 27వ తేదీలోగాఫీజు చెల్లించాల్సి వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X