వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిలో చంద్రబాబుహల్‌ చల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పాకిస్థాన్‌పై చర్య తీసుకునేవిషయంలో ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వంవిశ్వాసంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

అన్ని రాజకీయ పార్టీలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పి కొట్టే చర్యలు చేపట్టాలని ఆయన శనివారంవిలేకరులతో అన్నారు. దేశ ప్రయోజనాలు, రక్షణవిషయాల్లో భేదాభిప్రాయాలు వుండకూడదని ఆయన అన్నారు. ఇక్కడ రాజకీయాలకు తావు ఉండకూడదని, దేశ ప్రయోజనాల దృష్ట్యా కలిసికట్టుగా పార్టీలన్నీ ముందుకు వచ్చి పరిస్థితి ఎదుర్కోవాలని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నాయకత్వంమిమ్మల్ని సంప్రదించిందా అని విలేకరులు అడిగితే తమ పార్టీ నాయకులు ప్రభుత్వంతో మాట్లాడుతూనే వున్నారని చంద్రబాబు జవాబిచ్చారు.

పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి ఇదే తగిన సమయమనిమీరు భావిస్తున్నారా అని అడిగితే కొన్ని సార్లు ఎక్కువ మాట్లాడి తక్కువ చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఏం చేయాలనిమీరు భావిస్తున్నారని ప్రశ్నిస్తే ఆ విషయం గురించి ఆలోచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నదని, వ్యక్తులు తమ తమ అభిప్రాయాలను ప్రచారం చేయడం సరి కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X