వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు ఊళ్లు దగ్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గుంటూరు, ప్రకాశం,శ్రీకాకుళం జిల్లాల్లో మూడు ఘోర అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దాదాపు 850 ఇళ్లుఅగ్ని ఆహుతి అయ్యాయి. ధాన్యం, నగలు, నగదు దగ్ధమయ్యాయి. దాదాపు 2.25 కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించింది. ప్రజలు గూడు కోల్పోయారు.పెద్ద యెత్తున పశువులు సజీవ దహనమయ్యాయి.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగినఅగ్ని ప్రమాదంలో 300 ఇళ్లు దగ్ధమయ్యాయి.గేదెలు, మేకలు, గొర్రెలు మంటల్లో చిక్కుకున్నాయి. ఒంటేరు యర్రయ్య అనే అతని ఇంటిలో పిండి వంటలు చేస్తుండగా పొయ్యి నుంచి చెలరేగిన నిప్పురవ్వలుపైకప్పునకు అంటుకున్నాయి. దీనికి గాలి తోడవ్వడంతోమిగతా ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి.

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామంలో సంభవించినఅగ్నిప్రమాదంలో 350 ఇళ్లు దగ్ధమయ్యాయి. 500 కుటుంబాలు వీధిన పడ్డాయి. కొంత మంది జీడిపిక్కలు కాల్చే ప్రయత్నం చేస్తుండగాపేలిన జీడిపిక్క ఒకటి ఇంటిపై పడింది. వెంటనే మంటలు ఊరంతా వ్యాపించాయి.

గుంటూరు జిల్లా కొల్లిపరలో జరిగిన మరో అగ్ని ప్రమాదంలో సుమారు 200 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామంలో దళితవాడ తూర్పు భాగం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.విద్యుత్‌ తీగలపై కొబ్బరి మట్టలు పడడంతో మంటలు చెలరేగి వ్యాపించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X