వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రకు ఐదు లక్షల టన్నుల బియ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్థాన్‌తో యుద్ధానికైనా సిద్ధమేనని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి అన్నారు. ఆయన మంగళవారంనాడిక్కడ ఈ ప్రకటన చేశారు.

పాకిస్థాన్‌ బలవంతంగా యుద్ధాన్ని రుద్దుతోందని ఆయనవిమర్శించారు. పాకిస్థాన్‌తో తాడో పేడో తేల్చుకోవాల్సి వున్నదని, ఈవిషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు. మొతంగా ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాల్సిన అవసరం మాత్రం ఉన్నదని ఆయన అన్నారు.

గుజరాత్‌ పరిస్థితి ఆసరాగా తీసుకుని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వాన్ని కూల్చాలన్న కాంగ్రెస్‌ కుట్రలు సాగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు కూడాఅస్థిర పరచలేరని ఆయన అన్నారు. దేశంలో తృతీయ ఫ్రంట్‌కు అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X