వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్టు దాడుల పై అమెరికా భయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ ప్రాంతం భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు పార్టీ జాతీయాధ్యక్షుడు జనా కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాంతం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఆయన మంగళవారంనాడిక్కడ సమావేశమయ్యారు.

తెలుగుదేశం పార్టీతో కలిసి వుంటే తెలంగాణాలో పార్టీ నిర్వీర్యం అవుతుందని వారు చెప్పారు. ప్రజా సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టలేని పరిస్థితి వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా తమను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములను చేయడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ఈవిషయంలో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దున్నే గలిగే భూమి అనే నినాదంతో పార్టీపెద్ద యెత్తున ఉద్యమం చేపట్టాలని వారు సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X