వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత విద్యుత్‌ ఓట్ల రాజకీయం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కజికిస్థాన్‌లోని ఆల్మటిలో పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిల మధ్య సమావేశం జరిగే అవకాశం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) చెప్పింది.

రష్యా అధ్యక్షుడువ్లదిమీర్‌ పుతిన్‌ ప్రతిపాదనను భారత్‌ అంగీకరించబోదని బిజెపి ప్రకటన స్పష్టం చేసినట్లయింది. ప్రధాని వాజ్‌పేయి పాకిస్థాన్‌ అధ్యక్షుడు ముషార్రఫ్‌ను కలిసే ప్రసక్తి లేదని బిజెపి అధికార ప్రతినిధి సునీల్‌ శాస్త్రి అన్నారు. ముషార్రఫ్‌ను నమ్మడానికివీల్లేదని ఆయన అన్నారు. ముషారఫ్‌ జనవరి 12వ తేదీన చేసిన వాగ్దాలను వేటినీ నెరవేర్చలేదని ఆయన అన్నారు.

ప్రధాని వాజ్‌పేయి మనాలిలో అసాధారనమైన ప్రకటన చేశారని, తాను ప్రధానిని అనేవిషయం మర్చిపోయారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఎస్‌. జైపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విధమైన అయోమయమైన ప్రకటన ఎందుకు చేశారో ప్రధానివివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X