నక్సల్స్తో చర్చలకు మంత్రులు
హైదరాబాద్:పీపుల్స్వార్తో
శాంతి
చర్చలకు
మంత్రులను
పంపాలని
చంద్రబాబునాయుడు
ప్రభుత్వం
నిర్ణయించింది.పీపుల్స్వార్పై
నిషేధాన్ని
ఎత్తివేయాలన్న
ప్రతిపక్షాలవిజ్ఞప్తిని
ప్రభుత్వం
త్రోసి
పుచ్చింది.చర్చలకు
ఇద్దరు
లేదా
ముగ్గురు
మంత్రులను
పంపాలని
నిర్ణయించింది.
చర్చలకు
ఎజెండాను,
ప్రతినిధులను
ఒకటి,
రెండు
రోజుల్లో
ఖరారు
చేస్తుంది.
చర్చలను
హైదరాబాద్లోనే
జరపాలని
ప్రభుత్వం
భావిస్తోంది.చర్చలు
పీపుల్స్వార్
నక్సల్స్తోనే
జరగాలని,
ఇందుకు
తగిన
వాతావరణం
కల్పిస్తామని
ప్రభుత్వం
అంటోంది.పీపుల్స్వార్తో
చర్చలకు
ప్రభుత్వం
ఒకటి
రెండు
రోజుల్లో
తన
ప్రతినిధులపేర్లను
ప్రకటించనుంది.
పీపుల్స్వార్
నక్సల్స్తో
శాంతి
చర్చల
ప్రతిపాదనపై
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
సోమవారం
అఖిల
పక్ష
సమావేశం
ఏర్పాటు
చేశారు.
ఈ
సమావేశంవివరాలను
హోం
మంత్రి
తూళ్ల
దేవేందర్
గౌడ్విలేకరులకు
చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్, బిజెపి,సిపిఐ-ఎం, టిఆర్ఎస్, ఎంఐఎం ప్రతినిధులు పాల్గొన్నారు. నక్సలైట్ కార్యకలాపాలపై పోలీసు, రాష్ట్ర ఇంటలిజెన్స్ సంస్థలు తయారు చేసినవివరణ పత్రాలను అఖిల పక్ష సమావేశంలో అందజేశారు.
చర్చల ప్రారంభానికి ప్రభుత్వం త్వరిత గతిన ముందుకు కదలాలని తాము ఆశిస్తున్నట్లు సిపిఐ-ఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ముందు హింస ఆగిపోవాలని, ఆ తర్వాతభూసంస్కరణలపై, భూములు లేని పేదలకు భూమిపంపకంపై చర్చలు జరగాలని ఆయన అన్నారు. చర్చల ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ నేత ఎన్. ఇంద్రసేనా రెడ్డి కూడా సమర్థించారు. చర్చలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేతకె. కేశవరావు అన్నారు.