వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ మొండిఘటంః ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: పాకిస్థాన్‌ నుంచి చొరబాట్లు గుర్తించదగినంత తగ్గిపోలేదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్నిఆపి, 20 మంది ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడానికి పాకిస్థాన్‌ చర్యలు తీసుకునేంత వరకు ఉభయ దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితే కొనసాగుతుందని ఆయన బుధవారంవిలేకరులతో అన్నారు.

పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి చొరబాట్లు తగ్గినట్లు తగిన ఆధారాలేవీ లేవని, తగిన ఆధారాలు చూపే వరకు చొరబాట్లు తగ్గాయని పాకిస్థాన్‌ చెప్తున్న మాటలను అంగీకరించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలు ఎలా తగ్గుతాయని అడిగితే- సీమాంతర ఉగ్రవాదం ఆగిపోవాలని, 20 మంది ఉగ్రవాదులను తనకుఅప్పగించాలని భారత్‌ పాకిస్థాన్‌ను కోరిందని, ఇందులో 14 మంది భారతీయులు కాగామిగతావాళ్లు పాకిస్థానీలని ఆయన జవాబిచ్చారు. ఆరుగురి అప్పగింతవిషయంలో పాకిస్థాన్‌కు పరిమితులున్నాయని, ఈ విషయమై చర్చలు జరపవచ్చు.మిగతా 14 మందిని అప్పగిస్తే విచారణ జరిపిస్తామని ఆయన అన్నారు.

భారత్‌, పాక్‌ల మధ్య అణ్వస్త్ర యుద్ధం జరగవచ్చునని ప్రచారం చేసేవారికి ప్రత్యేకమైన ఎజెండా ఉన్నదని, భయాందోళనలు సృష్టించి, ఒత్తిడి తేవడం, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఆ ప్రత్యేకమైన ఎజెండా అని పెర్నాండెజ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X