వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్ పేయి,ముషారఫ్ కు బుష్ ఫోను
వాషింగ్టన్ః భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవలసిందిగా అమెరికా అధ్యక్షుడు బుష్ ఉభయ దేశాధినేతలకువిజ్ఞప్తి చేశారు. ఆల్మటి సదస్సులో కూడా భారత్ - పాకిస్తాన్ సమస్య ఉపశమించకపోవడంతో ఆయన బుధవారం రాత్రి ఇరుదేశాధినేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. యుద్ధం ముప్పు తప్పించేందుకు ఉభయ దేశాలు ప్రయత్నించాలనికోరారు. చర్చలు జరపాలంటూ ఉభయదేశాలకు నొక్కి చెప్పారు. బుష్ ఫోన్ సంభాషణవివరాలను వైట్ హౌస్ ప్రతినిధి ఆరీ ఫిషర్ వెల్లడించారు.
Comments
Story first published: Thursday, June 6, 2002, 23:53 [IST]