వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకకు తరలిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: మహారాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభ్యులు కర్ణాటకకు తరలిపోయారు. ఫిరాయింపులను నివారించడానికివీరిని కర్ణాటకకు పంపిస్తున్నట్లు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్గాలు చెప్పాయి. తన శాసనసభ్యులను కాంగ్రెస్‌ మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు పంపించడం ఇదే తొలిసారి.

కాంగ్రెస్‌ శాసనసభ్యుడు పద్మాకర్‌ వాల్వి డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని శివసేన- బిజెపి శిబిరంలో చేరారు. దీంతో 288 మంది సభ్యులు గల రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌ శాసనసభ్యుల సంఖ్య 73కు పడిపోయింది.

తమ వైపు వచ్చిన పద్మాకర్‌ వాల్విని ప్రతిపక్ష నాయకుడు నారాయణ్‌ రాణేవిలేకరుల ముందు హాజరు పరిచారు. విలాస్‌ రావు దేశ్‌ముఖ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని తమ వైపు నలుగురు ఎన్‌సిపి శాసనసభ్యులతో పాటు 17 మంది శాసనసభ్యులు వచ్చారని బిజెపి నాయకుడు గోపీనాథ్‌ ముండేవిలేకరులకు చెప్పారు. తమకు మద్దతు ఇస్తున్నట్లు ఇద్దరు కాంగ్రెస్‌ శాసనసభ్యులు, 11 మంది ఎన్‌సిపి శాసనసభ్యులు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. ఇండోర్‌లో ఉన్న ఆరుగురు ఎన్‌సిపి శాసనసభ్యులు, ఇద్దరు మంత్రులు తమతో సంప్రదింపులు జరుపుతున్నాని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X