వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ చేతకాకపోతే తప్పుకోఃఎమ్మెస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃవిద్యుత్‌ ఛార్జీలను తగ్గించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావుచంద్రబాబు నాయుడ్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రలో అనూహ్య రీతిలోవిద్యుత్‌ చార్జీలను పెంచిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పుకోలని స్థితిలో వున్నారని ఆయనవిమర్శించారు. ప్రపంచబ్యాంక్‌ కు దాసోహం అన్న చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు సుధీర్‌ కుమార్‌ మరణంతో నిలిచిపోయిన ప్రజాబ్యాలెట్‌ కార్యక్రమాన్ని ఎమ్మెస్సార్‌ గురువారం హైదరాబాద్‌ లో ప్రారంభించారు.

విద్యుత్‌ ఛార్జీలపెంపు, ఆస్తి పన్ను పెంపు వంటి అంశాలపై జరుపుతున్న ఈ ప్రజాబ్యాలెట్‌ ఫలితాలు చంద్రబాబుకు గుణపాఠం నేర్పాలన్నారు.విద్యుత్‌ ఛార్జీల పెంపును రాష్ట్రంలో ప్రతిఒక్క పౌరుడు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రపంచబ్యాంక్‌ షరతుల్ని కాదనలేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X