వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సూర్యుని చుట్టూ ఇంద్ర ధనస్సు!
హైదరాబాద్ః బుధవారం సూర్యుని చుట్టూ ఏర్పడిన రంగుల విలయం భాగ్యనగర వాసుల్ని ఆందోళనకు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి మూడు గంటల పాటు ఈ రంగుల వలయాన్ని ప్రజలు తిలకించారు. కొందరు ఇది అరిష్ఠానికి నాందిగా భావించారు. మరి కొందరు ఆందోళనతో పత్రికా కార్యాలయాలకు, జ్యోతిష పండితులకు ఫోన్ చేశారు. కేవలం వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా సూర్యుని చుట్టూ ఈ రంగుల వలయం ఏర్పడిందని బిర్లా ప్లానిటోరియం అధినేత సిద్ధార్ధ వివరణ ఇచ్చారు. వాతావరణంలో తేమ, జల్లుల కారణంగా ఈ వలయం కనిపించిందని ఇందులో వింత ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
Story first published: Thursday, June 6, 2002, 23:53 [IST]