వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి కృష్ణకాంత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నక్సల్స్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ హెచ్చరించారు. చర్చల సమయంలో నక్సల్స్‌ కదలికలను పసిగడుతూ అడుగు ముందుకేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అద్వానీ గురువారం రాత్రివిందు ఇచ్చారు.

చర్చల సమయంలో ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటును ఆసరగా చేసుకుని నక్సలైట్లు తమ క్యాడర్‌ను మరింత పటిష్టపరుచుకునే ప్రమాదం ఉన్నదని,అందువల్ల ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించాలని అద్వానీ చంద్రబాబుకు సూచించారు.

రాష్ట్రంలో నక్సలైట్‌ ప్రతినిధులకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరిగిన ప్రాథమిక చర్చలవివరాలను చంద్రబాబు అద్వానీకి వివరించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X