వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకార్మిక వ్యవస్థపై వేటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఇంటిపై సిబిఐ అధికారుల బృందం మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ దాడిలో రెండున్నర కోట్ల రూపాయలవిలువైన నగదును, బంగారు ఆభరణాలను,ఫిక్సెడ్‌ డిపాజిట్‌ రశీదులను సిబిఐ అధికారులుస్వాధీనం చేసుకున్నారు.

ఇండియన్‌ రెవెన్యూసర్వీస్‌ 1977 బ్యాచ్‌కు చెందిన అధికారి అయిన మైథిలీ రాణి ఇన్‌కమ్‌టాక్స్‌ కమిషనర్‌ (అప్పీల్లు)గా పని చేస్తున్నారు. ఆమె అక్రమాలకు, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సిబిఐ అధికారులవిచారణలో వైల్లడైనట్లు సమాచారం. మైథిలీరాణి స్థిరాస్తులవివరాలను సిబిఐ అధికారులు సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారుల ఇళ్లపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వసీనియర్‌ అధికారులకు చెందిన 66 నివాసాలపై సిబిఐ దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో గల ఐటి కమిషనర్‌ ఇంటిపైనే కాకుండావిశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లోని సీనియర్‌ అధికారుల ఇళ్లపై సిబిఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X