వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధికారులపై సిఎం ఆగ్రహం
శ్రీనగర్ః సరిహద్దులో అల్ ఖైదా తీవ్రవాదుల కదలికలున్నాయని, అవసరమైతే భూతలసెన్సార్లను పంపుతామంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను భారత్ సున్నితంగా త్రోసిపుచ్చింది. జమ్ము కాశ్మీర్ లో మాటువేసిన అల్ ఖైదా దళాలను మట్టుపెట్టేందుకు మరో దేశం సాయం అవసరం లేదని భారత్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. గురువారం ఆయన శ్రీనగర్ లోవిలేకర్లతో మాట్లాడుతూ అల్ ఖైదా తీవ్రవాదుల్ని తుదముట్టించే సత్తా భారతసేనలకు పుష్కలంగా వున్నదన్నారు. ఇందుకోసం విదేశీసేనల సహాయం భారత్ కు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
Story first published: Thursday, June 13, 2002, 23:53 [IST]