వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు చెస్‌ రాణి హంపి కంట కన్నీరు

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌ః గత నెలలో జరిగిన ఒక యువకుని హత్య కేసులో కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి సుద్దాల దేవయ్య హస్తం వున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నెల 29న మెదక్‌ జిల్లా చిన కోడూరు మండలం ఇబ్రహీం నగర్‌ గ్రామశివార్లలో 28 ఏళ్ల యువకుడు శ్రీనివాస్‌ హత్యకు గురయ్యాడు. అతడు గతంలో రాష్ట్ర మంత్రి సుద్దాల దేవయ్య వద్ద డ్రైవర్‌ గా పనిచేశారు. నాలుగేళ్ళ కిందట మంత్రి వద్ద ఉద్యోగాని గుడ్‌ బై చెప్పి సొంతగా జీపు నడుపుకుంటున్నాడు. అయితే గత నెలలో మెదక్‌ జిల్లా లో శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని ఆదివారంఅరెస్టు చేశారు. వీరిలో ఒకరుమంత్రి ఇంట్లో వంటమనిషి కాగా మరో వ్యక్తి కరీంనగర్‌ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో పనిచేసే వ్యక్తి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన పోలీసులకు హత్యలో మంత్రి హస్తం వుందని తెలియడంతో ఖంగు తిన్నారు. ఏ మాత్రం సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడడం ప్రారంభించారు.

మంత్రి ఇంట్లో వంటమనిషి రాములు, దేశం కార్యాలయంలో పనిచేసే రాజు శ్రీనివాస్‌ ను కలిసి జీపు బాడుగకు తీసుకున్నారు. అర్థరాత్రి సమయంలో జీపు మెదక్‌ జిల్లా కు వచ్చిన వెంటనే నిర్మానుష్యంగా వున్నప్రదేశంలో శ్రీనివాస్‌ ను కత్తులతో పొడిచి చంపారు. ఆ తరువాత జీపును హైవే పై బోల్తా కొట్టించి యాక్సిడెంట్‌ గా నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారినిఅరెస్టు చేసి ప్రశ్నించగా మంత్రి సుద్దాల దేవయ్య తమ చేత ఈ హత్య చేయించారని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.

ఈ హత్య వ్యవహారంతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని మంత్రి సుద్దాల దేవయ్య స్పష్టం చేశారు. ఇదేవిషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పేందుకు ప్రయత్నించగా చంద్రబాబు ఆయనను కలిసేందుకు సుముఖత చూపలేదని తెలుస్తున్నది. చట్టం ప్రకారం పనిచేసుకుపొండి అని సిఎం నుంచి, హోం మంత్రి నుంచి పోలీసులకు సమాచారంఅందినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X