తెలుగు చెస్ రాణి హంపి కంట కన్నీరు
మెదక్ః గత నెలలో జరిగిన ఒక యువకుని హత్య కేసులో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి సుద్దాల దేవయ్య హస్తం వున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నెల 29న మెదక్ జిల్లా చిన కోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామశివార్లలో 28 ఏళ్ల యువకుడు శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. అతడు గతంలో రాష్ట్ర మంత్రి సుద్దాల దేవయ్య వద్ద డ్రైవర్ గా పనిచేశారు. నాలుగేళ్ళ కిందట మంత్రి వద్ద ఉద్యోగాని గుడ్ బై చెప్పి సొంతగా జీపు నడుపుకుంటున్నాడు. అయితే గత నెలలో మెదక్ జిల్లా లో శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని ఆదివారంఅరెస్టు చేశారు. వీరిలో ఒకరుమంత్రి ఇంట్లో వంటమనిషి కాగా మరో వ్యక్తి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో పనిచేసే వ్యక్తి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన పోలీసులకు హత్యలో మంత్రి హస్తం వుందని తెలియడంతో ఖంగు తిన్నారు. ఏ మాత్రం సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడడం ప్రారంభించారు.
ఈ హత్య వ్యవహారంతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని మంత్రి సుద్దాల దేవయ్య స్పష్టం చేశారు. ఇదేవిషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పేందుకు ప్రయత్నించగా చంద్రబాబు ఆయనను కలిసేందుకు సుముఖత చూపలేదని తెలుస్తున్నది. చట్టం ప్రకారం పనిచేసుకుపొండి అని సిఎం నుంచి, హోం మంత్రి నుంచి పోలీసులకు సమాచారంఅందినట్లు తెలిసింది.