వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కలాంకు ఘనస్వాగతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సాంఘిక సంక్షేమ శాఖలో కోట్లాదిరూపాయల స్కాలర్‌ షిప్‌ లకు పాల్పడ్డ ఎనిమిది మంది ఉద్యోగులను నగర పోలీసులుఅరెస్టు చేశారు. బోగస్‌, కాలేజీలు, విద్యార్థులను సృష్టించి, వారికి కాగితాలపై ఉపకార వేతనాలు ఇప్పించిన ఈ ఎనిమిది మంది సుమారు 18 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు యువ ఉద్యోగులు ఈ స్కాం సూత్రధారులు. హైదరాబాద్‌ డిస్ట్రిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మోతీనాయక్‌,అకౌంటెంట్‌ శంకర్రావులు ఈ కేసులో ప్రధాన నిందితులు, పే అండ్‌అకౌంట్స్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సంతోష్‌, అంజయ్య, ప్రభాకర్‌ రావు, వెంకటస్వామి, ప్రవీణ్‌ చందర్‌, వెంటకేశ్వరరావు, ఇంద్రసేనలను కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులుఅరెస్టు చేశారు. వీరు అక్రమంగా కూడపెట్టిన ఆస్తులనుస్వాధీనం చేసుకొనే ప్రక్రియ ప్రారంభించారు.

మోతీనాయక్‌ ఆరు బోగస్‌ కాలేజీలు సృష్టించి, పే అండ్‌అకౌంట్స్‌ సిబ్బందితో కుమ్మక్కై ఉపకార వేతనాలుమంజూరు చేయించుకున్నారు. 18 కోట్ల రూపాయలవరకు మోతీనాయక్‌ అక్రమంగా విత్‌ డ్రా చేశారు.ఈ మొత్తంలో కొంత మిగిలిన వారికి ఇచ్చి సింహభాగంతాను దిగమింగాడు. మెహిదీపట్నంలోని ఆంధ్రాబ్యాంక్‌లో మోతీనాయక్‌, ఆయన బంధువులు అకౌంట్‌లో కోటి రూపాయల నగదు వున్నట్లు పోలీసులుకనుగొన్నారు. ఇంకా పలు చోట్ల కోట్ల విలువచేసేస్థిరచరాస్తులు వున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X