వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త అప్పులకు ఇకస్వస్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ లో రక్షణపరిశోధనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం శ్లాబ్‌ సోమవారం రాత్రి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు కూలీల పరిస్థితి ఆందోళనకరంగా వుంది. కాంచన్‌ బాగ్‌ లోని బిడిఎల్‌ క్షిపణి పరీక్షల కోసం నాలుగు సినిమా ధియేటర్ల వైశాల్యంలో ఒక ఆడిటోరియం నిర్మాణం ప్రారంభించారు. ఏడాదికిందటే ప్రారంభమైన ఈ నిర్మాణం పనులు ప్రభాకర్‌ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ పర్యవేక్షిస్తున్నారు.

45 అడుగుల ఎత్తు పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. సోమవారం రాత్రి శ్లాబ్‌ కుపెట్టిన సపోర్ట్‌ లు ఒకొక్కటిగా కూలిపోవడం ప్రారంభించాయి. ఆ తరువాత క్షణాల్లో శ్లాబ్‌ కుప్పకూలిపోయింది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కూలీలు ప్రాణాలుఅరచేత పట్టుకొని పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదర్‌ గూడఅపోలో ఆస్పత్రిలో చేర్పించారు. శిధిలాల తొలగింపు పూర్తయితే కానీ ఈ ప్రమాదంలో ఎవరైనాచనిపోయిందీ లేనిదీ తెలియదని అధికారులు చెబుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X