వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వార్ధంతోనే ప్రత్యేక తెలంగాణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రరాజధానికి కూతవేటుదూరంలో వున్న రంగారెడ్డి జిల్లాలో, నిజామాబాద్‌ జిల్లాలో బాణామతి నెపంతో ఇద్దరిని గ్రామస్థులు దారుణంగా హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌ కు చెందినగోరే మియా(60) బాణామతి చేస్తున్నాడని అనుమానించిన గ్రామస్తులు కొందరు అతని కుమారుడ్ని చెట్టుకు కట్టేశారు. అతనిని విడిపించుకొనేందుకు వచ్చిన గోరేమియాను కట్టెలతో చితకబాదారు. స్పృహతప్పి పడిపోయిన గోరేమియాను కుమారుడు ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేస్తుండగా గ్రామస్తులు మరోసారి దాడి చేసి రాళ్ళతో కొట్టి దారుణంగా హత్య చేశారు.

నిజమాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకపల్లి గ్రామంలో సోమవారం రాత్రి బట్టు వెంకయ్య అనే వ్యక్తి బాణామతి చేస్తున్నాడనే కోపంతో దారుణంగా హత్య చేశారు. కొందరు గ్రామస్తులు గ్రామం మధ్యలో వున్న మామిడి చెట్టుకు వెంకయ్యను కట్టివేసి చావగొట్టారు. దీంతో కొనప్రాణంతో వున్న అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతన మరణించాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X