వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్‌లో భూకంపం: 500 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

టెహ్రాన్‌: ఇరాన్‌ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను శనివారం పెను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపానికి 500 మందికి పైగా బలయ్యారు. వేయి మందికి పైగా గాయపడ్డారు. ఓపెన్‌ ఎండెడ్‌ రిచర్‌ స్కేలుపై దీని తీవ్రత ఆరు డిగ్రీలుగా నమోదయింది.

ఖాజ్విన్‌ ప్రొవిన్స్‌లోని బౌంజహ్రా నగరం సమీపంలో గల ఆవాజ్‌లోని 52 ఉప జిల్లాలు భూకంపం తాకిడికి అతలాకుతలమయ్యాయి. ఈ ప్రాంతాల్లో యాభై నుంచి వంద శాతం వరకు నష్టం వాటిల్లినట్లుస్టేట్‌ టెలివిజన్‌ ప్రకటించింది. ఆవాజ్‌లోని ఆరు ఉప జిల్లాలు పూర్తిగా ధ్వంసమైనట్లుస్టేట్‌ న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఎ తెలియజేసింది.

భూకంపం మొదట భారత కాలమానం ప్రకారం ఉదయం గం.8.28 నిమిషాలకు బౌంజహ్రాలో వచ్చింది. ఆ తర్వాత ఉగయం 8.31 నిమిషాలకు వచ్చింది. భూకంపంలో గాయపడిన వారి సంఖ్య మరింతపెరిగే అవకాశాలున్నాయని, కచ్చితమైన లెక్కలుఅందుబాటులో లేవని, ఇంకా ఎంతో మంది మరణించి వుంటారని ఖాజ్విన్‌లోని రెడ్‌ క్రెసెంట్‌సొసైటీ అధిపతి మజీద్‌ శాల్విరి అన్నారు.

హమేదాన్‌ పొరుగున గల రజాన్‌లో ముగ్గురు మరణించారు; వంద మంది గాయపడ్డారు. ఆవాజ్‌లో గాయపడిన 120 మందితో ఆ ప్రాంతంలోని ఆస్పత్రులు నిండిపోయినట్లు అంతకు ముందు ఐఆర్‌ఎన్‌ఎ తెలిపింది. భూకంపంటెహ్రాన్‌, జిలాన్‌, అర్డెబిల్‌ ప్రొవిన్స్‌లను, జంజన్‌, కోర్దెస్థాన్‌ ప్రాంతాలను కూడా తాకింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X