వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో ముగ్గురుమిలిటెంట్ల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: కాశ్మీర్‌లో తహ్రీక్‌- ఉల్‌- ముజాహిదీన్‌ జిల్లా కమాండర్‌తో పాటు ముగ్గురు ప్రధానమిలిటెంట్లు హతమయ్యారు. ఒక మిలిటెంట్‌అరెస్టయ్యాడు. మరో మిలిటెంటు లొంగిపోయాడు. ఈ సంఘటనలన్నీ శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు జరిగాయి.

కుప్వారా జిల్లాలోని కాక్రూసా అడవుల్లో జరిగిన శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాల చేతిలో తహ్రీక్‌- ఉల్‌- ముజాహిదీన్‌ జిల్లా కమాండర్‌ బషీర్‌ అహ్మద్‌మీర్‌ హతమయ్యాడు. ఇతని వద్ద నుంచి ఒక ఎకెరైఫిల్‌ను, మూడు మాగజీన్లను, 60 రౌండ్లనుస్వాధీనం చేసుకున్నారు.

కుప్వారా ప్రాంతంలోని దేవర్‌- లోలబ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో విదేశీ చొరబాటుదార్లు ఉసామా జంగి, అబూ రెహ్మన్‌ హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి రెండు ఎకెరైఫిళ్లు, నాలుగు మాగజీన్లు, ఒక వైర్‌లెస్‌సెట్‌, ఆరు హ్యాండ్‌ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆల్‌- ఫతే సంస్థకు చెందిన బిల్లాగా పేరు మోసిన రషీద్‌ గనాయ్‌ ఒక ఎకెరైఫిల్‌, రెండు మాగజీన్లు, 60 రౌండ్లు, రెండు చేతిబాంబులతోకుప్వారాలో సైనిక, పోలీసు అధికారుల ముందు లొంగిపోయాడు. అనంతనాగ్‌ జిల్లాలో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ముస్తాక్‌ అహ్మద్‌ అలియాస్‌ షబ్నంనుసైన్యం అరెస్టు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X