వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట మార్చిన విహెచ్‌పి

By Staff
|
Google Oneindia TeluguNews

హరిద్వార్‌ః అయోధ్యలో రామాలయం నిర్మాణం వ్యవహారానికి సంబంధించి కోర్టు తీర్పునకు కట్టుబడి వుంటామని గతంలో ప్రకటించిన విశ్వహిందూపరిషత్‌ హఠాత్తుగా మాటమార్చింది. హరిద్వార్‌లో జరిగిన విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ మార్గదర్శి మండల్‌ సమావేశంలో, భక్తి విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారాలను కోర్టులు నిర్ణయించలేవని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. రామాలయం వ్యవహారంపై చర్చల ప్రసక్తి లేదని పేర్కొంది. మండల్‌ సమావేశం రామాలయం నిర్మాణానికి తమ కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది.

మార్చి 15న నిర్వహించిన శిలాదాన్‌ కార్యక్రమానికి ముందుగా అయోధ్యపై తమకు ఇచ్చిన మాటను కేంద్ర ప్రభుత్వం, ముస్లింపర్సనల్‌ లా బోర్డు ఉల్లంఘించినట్టుగా విహెచ్‌పి ఆరోపించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా వున్న 90 కోట్ల మంది హిందువులకు సంబంధించిన సమస్య అని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్‌ తొగాడియా చెప్పారు. ప్రజాస్వామిక వ్యవస్థలో న్యాయవ్యవస్థ పాత్రపై తమకు గౌరవం వున్నదని అయితే మతవిశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో కోర్టులకు ప్రమేయం కూడదని ఆయన అన్నారు. శిలాదాన్‌ సమయంలో విహెచ్‌పి నేతఅశోక్‌ సింఘాల్‌ రామజన్మభూమి న్యాస్‌ మానేజింగ్‌ ట్రస్టీ హోదాలో కోర్టు తీర్పుకు కట్టుబడి వుంటామని ప్రధానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినవిషయం నిజమేనని అయితే ప్రభుత్వం ముస్లింపర్సనల్‌ లా బోర్డు తమ హామీలను ఉల్లంఘించి శిలాదాన్‌కు అడ్డుతగిలిన కారణంగా తాము కూడా హామీని ఉల్లంఘిస్తున్నట్టుగా తొగాడియా చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X