వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌ ద్వారాఫైళ్ల పరిష్కారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ద్వారా పెండింగ్‌ఫైళ్లను పరిష్కరించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం మంత్రుల, ఉన్నతాధికారుల సమావేశంలో ప్రకటించారు. పెండింగ్‌ఫైళ్ల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమావేశం జరిగింది.

సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయి వరకుఫైళ్లను కంప్యూటర్‌లో పొందు పరిచి, ఆన్‌లైన్‌ ద్వారాఫైళ్లను పరిష్కరించనున్నారు. ఫైళ్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలని ముఖ్యమంత్రి మంత్రులను, అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో మొత్తం పది లక్షల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ఫైళ్లను నాలుగు కెటగిరీల కింద విభజించారు. ఇందులో 33.2 శాతం ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి కాగా 14.2 శాతం కోర్టుల్లో నలుగుతున్నాయి. కోర్టుల్లో చిక్కుకున్నఫైళ్ల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. పెండింగ్‌ఫైళ్లు గుదిబండగా మారాయని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పెండింగ్‌ఫైళ్ల పరిష్కారం ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X