వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు మంత్రులపై కృష్ణ వేటు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు వుండవచ్చునని సమాచారం. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తితో పాటు పలువురు కొత్తవారికి మంత్రి పదవులు లభించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ జులై 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రకటించారు. మంత్రులు ఎల్‌.కె. అద్వానీ, జస్వంత్‌సింగ్‌, ప్రమోద్‌ మహాజన్‌లతో రెండో విడత గురువారం చర్చించిన అనంతరం ప్రధాని ఈవిషయం ప్రకటించారు. లక్నో పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ నెల 29వ తేదీన మరోసారి ప్రధాని కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి.

ఆర్థిక మంత్రిగా యశ్వంత్‌ సిన్హాను కొనసాగించే అవకాశాలున్నాయని, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌కు మంత్రి వర్గంలో చోటు లభించవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రి పదవి చేపట్టేందుకు జనా కృష్ణమూర్తిఅంగీకరిస్తే బిజెపి అధ్యక్ష పదవిని గ్రామీణాభివృద్ధి మంత్రిఎం. వెంకయ్యనాయుడుకు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రధాని కోరితే పార్టీ పదవికి రాజీనామా చేయడానికి రెండు నిమిషాలు కూడా పట్టదని కృష్ణమూర్తి ప్రకటించారు. అదే సమయంలో ప్రధాని, హోం మంత్రి, పార్టీ అధ్యక్షుడు తనకు ఏ బాధ్యతలుఅప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా వున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ స్థితిలో అడ్డంకులు తొలిగిపోయినట్లేనని భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు లక్ష్మీ నారాయణ్‌ పాండేకు మంత్రి పదవి దక్కవచ్చుననిఅంటున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్‌ వర్మ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఢిల్లీకి ఇప్పటికే ఎక్కువగా ప్రాతినిధ్యం ఉన్నందున వర్మకు అవకాశాలు లేవని చెబుతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీకి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో పిఎంకెకు కూడా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X