ఐదుగురు మంత్రులపై కృష్ణ వేటు
న్యూఢిల్లీ:
కేంద్ర
మంత్రి
వర్గంలో
భారీ
మార్పులు
వుండవచ్చునని
సమాచారం.
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
అధ్యక్షుడు
జనా
కృష్ణమూర్తితో
పాటు
పలువురు
కొత్తవారికి
మంత్రి
పదవులు
లభించే
అవకాశాలున్నట్లు
ప్రచారం
జరుగుతోంది.
ఆర్థిక మంత్రిగా యశ్వంత్ సిన్హాను కొనసాగించే అవకాశాలున్నాయని, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్కు మంత్రి వర్గంలో చోటు లభించవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మంత్రి పదవి చేపట్టేందుకు జనా కృష్ణమూర్తిఅంగీకరిస్తే బిజెపి అధ్యక్ష పదవిని గ్రామీణాభివృద్ధి మంత్రిఎం. వెంకయ్యనాయుడుకు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రధాని కోరితే పార్టీ పదవికి రాజీనామా చేయడానికి రెండు నిమిషాలు కూడా పట్టదని కృష్ణమూర్తి ప్రకటించారు. అదే సమయంలో ప్రధాని, హోం మంత్రి, పార్టీ అధ్యక్షుడు తనకు ఏ బాధ్యతలుఅప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా వున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ స్థితిలో అడ్డంకులు తొలిగిపోయినట్లేనని భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యుడు లక్ష్మీ నారాయణ్ పాండేకు మంత్రి పదవి దక్కవచ్చుననిఅంటున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఢిల్లీకి ఇప్పటికే ఎక్కువగా ప్రాతినిధ్యం ఉన్నందున వర్మకు అవకాశాలు లేవని చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీకి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో పిఎంకెకు కూడా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభించవచ్చు.