వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏజెన్సీ ఉద్యోగులకు మంత్రి హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగులు పని చేసే చోట నివాసం ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ మంత్రి మణికుమారి హెచ్చరించారు. పని చేసే చోట నివాసం వుండని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆమె శనివారం సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు.

సౌకర్యాలు లేవనే సాకుతో పని చేసే చోట ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగులు వుండకపోతే సహించబోమని ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల సాధక బాధకాలు తమకు తెలుసునని,సరైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.

అన్యాక్రాంతమైన 64 ఎకరాల గిరిజన భూములను వన్‌ ఆఫ్‌సెవెంటీ కింద స్వాధీనం చేసుకుని తిరిగి గిరిజనులకుఅప్పగిస్తామని ఆమె చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోవికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X