వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కురుక్షేత్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

కురుక్షేత్రః రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం ఉదయం కురుక్షేత్రలో ప్రారంభమైంది. అయోధ్యవివాదం రసకందాయంలో పడిన సందర్భంగా జరుగుతున్న ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయోధ్యతో పాటు జమ్ము కాశ్మీర్‌అంశంపై కూడా రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత కె.ఎస్‌. సుదర్శన్‌ సారధ్యం వహిస్తున్నారు.

2001 లో జమ్ము కాశ్మీర్‌ పై ఏర్పాటు చేసిన జితేంద్రవీర్‌ గుప్తా కమిటీ తన నివేదికను ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కు సమర్పిస్తుంది. ఆ కమిటీ సూచనల ఆధారంగా కాశ్మీర్‌ పై ఒక తీర్మానం చేసే అవకాశం వుంది.
విశ్వహిందూ పరిషత్‌ నేతలు అశోక్‌ సింఘాలు, తగోడియా, బిజెపి నేతలు కుశ్‌ భావ్‌ ఠాక్రే ఈసమావేశాలకు హాజరవుతున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఈవివాదంపై కంచి శంకరాచార్య మధ్యవర్తిత్వానికిఅంగీకరిస్తూ ఇచ్చిన హామీ పత్రాలను ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వెనక్కు తీసుకొనేఅంశాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X