వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడి యాత్రను ఆపండి: సోనియా వినతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తలపెట్టిన గౌరవ రథ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని అటల్‌బిహారా వాజ్‌పేయిని కోరారు. ఇప్పటికే మత ఉద్రిక్తతలు చోటు చేసుకున్న గుజరాత్‌లో ఈ యాత్ర పరిస్థితిని మరింతవిషమింపజేస్తుందని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె వాజ్‌పేయికి ఒక లేఖరాశారు.

అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని, సంయమనాన్ని, సహోదరత్వాన్నిపెంపొందిచడం నేటి అవసరమని ఆమె అన్నారు. గుజరాత్‌లో ప్రతి శుక్ర, శని, ఆదివారాలు గౌరవ రతయాత్ర జరపాలని తలపెట్టడం, నరేంద్ర మోడిస్వయంగా అన్ని జిల్లాలు ఈ రకంగా పర్యటించాలనుకోవడం పరిస్థితిని దిగజారుస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవలి మత హింస వల్ల దేశ సాంఘిక చట్రం తీవ్రంగాదెబ్బ తిన్నదని, సామరస్యాన్ని పునరుద్ధరించి, బాధితుల్లో భద్రతా భావాన్నిపెంపొందించి, బాధితులకు పక్షపాత రహితంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంమీద ఉన్నదని ఆమె అన్నారు. గుజరాత్‌లో హింసకు కారణమైన సంస్థల గురించి మానవ హక్కుల కమిషన్‌, ఇతర సంస్థలు తెలిపాయని, రథ యాత్ర వల్ల హింసకు కారణమైన ఆ సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుందని, మైనారిటీల్లో అభద్రతా భావం పెరుగుతుందని సోనియా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X