వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చొరబాట్లు తగ్గినా ఆగలేదుః అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః సరిహద్దు అవతల నుంచి చొరబాట్లు కొంతమేరకు తగ్గాయని, పూర్తిగా ఆగిపోలేదని ఉపప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్‌.కె. అద్వానీ వ్యాఖ్యానించారు. చొరబాట్లు జరుగుతున్నాయా లేదా అనేది పసిగట్టడం అంత తేలిక కాదని, ఎవరైనా చొరబడుతూ పట్టుపడినా, భద్రతా సిబ్బందితో తలపడినప్పుడు మాత్రమే తీవ్రత తెలుస్తుందని అద్వానీ అన్నారు.

సరిహద్దులో చొరబాట్ల తగ్గిందీ లేనిదీ జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయంతీసుకోవాల్సి వుంటుందన్నారు. దీరూబాయ్‌ అంబానీకి నివాళిఅర్పించేందుకు ముంబయ్‌ వెళుతూ గుజరాత్‌ లో ఆగినఅంబానీ విలేకర్లతో మాట్లాడారు. సీమాతంర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లగా ఎంతో కృషి చేసి సఫలంఅయిందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని అద్వానీ అన్నారు. సరిహద్దులో చొరబాట్లు తగ్గాయే కానీ పూర్తిగా నిలిచిపోలేదనేవిషయాన్ని అమెరికాకు కూడా తెలియజేస్తామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X