వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధీరూబాయ్‌ అంబానీ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా ధర్మపురి సమీపంలోని నేరేళ్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురుపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.

మృతుల్లో ఉత్తర తెలంగాణా స్పెషల్‌ స్క్వాడ్‌ సారధి పద్మక్క అలియాస్‌ రజిత, ఆమె సహచరురాలు మానస, వార్‌ ప్రముఖుడు సాగర్‌ అలియాస్‌ కనకయ్య వున్నారు. వీరి నుంచి ఒక ఎ.కె. 47, రెండు ఎస్‌.ఎల్‌.ఆర్‌. లు స్వాధీనం చేసుకున్నారు.

జగిత్యాల ధర్మపురి అటవీ ప్రాంతంలో కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నక్సలైట్లు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటికే ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌వివాదాస్పదంగా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌కు క్షమాపణ చెప్పాలనిపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలోనే కరీంనగర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరగడం పరిస్థితిని మరింత తీవ్రం చేసే సూచనలున్నాయి. ప్రభుత్వానికి,పీపుల్స్‌వార్‌ నక్సలైట్లకు మధ్య జరగనున్న చర్చలపై ఈ ఎన్‌కౌంటర్ల ప్రభావం పడుతుందనడంలో అనుమానం లేదు. ఈ నెల 20వ తేదీనపీపుల్స్‌వార్‌ నేతలకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య నేరుగా చర్చలు తలపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X