వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ నేత ఇంట్లో భారీ పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి ఇంటిలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా పది మందికిస్వల్ప గాయాలయ్యాయి. గది పై కప్పు పెచ్చులూడి, శిథిలాలుమీద పడ్డాయి.

ఈ దుర్ఘటనలో గడీలో వుండే గుమాస్తా అంతయ్య (70), స్థానికుడు దుగ్యాల వెంకటరామారావు, రాంరెడ్డి దామోదర్‌ రెడ్డిని కలిసేందుకు తిరుమలగిరి నుంచి వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు వడకళ్ల రాములు, బోళ్ల మోషయ్య తీవ్రంగా గాయపడ్డారు. రాములు రెండు కాళ్లు నుజ్జ నుజ్జయ్యాయి. మోషయ్య ఎడమకాలువిరిగింది. పేలుడు సంభవించినప్పుడు దామోదర్‌ రెడ్డి, ఆయన కుమారుడుసర్వోత్తమ రెడ్డి మునగాల మండలం నర్సింహులుగూడెం హత్యకుగురైన కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు.

తిరుమలగిరి కార్యకర్తలు సంఘటనకు అరగంట ముందు వచ్చారు. మంచినీటి సమస్యపై దామోదర్‌ రెడ్డితోవిన్నవించుకునేందుకు వారు వచ్చారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం దామోదర్‌ రెడ్డి, ఆయన కుమారుడుసర్వోత్తమ్‌ రెడ్డి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుంగతుర్తి రావాల్సి ఉన్నది. శనివారం రాత్రి జిల్లా యువజన కాంగ్రెస్‌ నేత హత్యకు గురి కావడంతో వారి పర్యటన షెడ్యూల్‌ మారిపోయింది. దామోదర్‌ రెడ్డిని హతమార్చేందుకు ప్రత్యర్థులు బాంబుల వలవిసిరి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనంలో బాంబులు నిల్వ వుంచడం వల్ల ప్రమాదం సంభవించి వుండవచ్చుననే అభిప్రాయం కూడావినిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X